పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Sunday, 21 February 2016

హాకీ ఇండియా లీగ్‌ ఫైనల్లో పంజాబ్‌ v/s కళింగ


పంజాబ్‌ వారియర్స్‌, కళింగ లాన్సర్స్‌ జట్లు హాకీ ఇండియా లీగ్‌ (హెచఐఎల్‌) నాలుగో అంచె పోటీల్లో టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యాయి. శనివారం జరిగిన తొలి సెమీ్‌సలో పంజాబ్‌ 3-1తో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌పై గెలిచి.. వరుసగా మూడో ఏడాది ఫైనల్లోకి ప్రవేశించింది. మరో సెమీ్‌సలో కళింగ లాన్సర్స్‌ షూటౌట్‌లో 4-2తో డిఫెండింగ్‌ చాంపియన రాంచీ రేస్‌కు షాకిచ్చింది. ఈ మ్యాచ నిర్ణీత సమయంలో 2-2తో సమంకావడంతో.. విజేతను తేల్చడానికి షూటౌట్‌ నిర్వహించారు. రాంచీ నాలుగు గోల్‌ ప్రయత్నాల్లో కేవలం రెండు మాత్రమే సద్వినియోగం చేసుకోగా.. కళింగ వరుసగా నాలుగు గోల్స్‌ కొట్టి గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో పంజాబ్‌తో కళింగ అమీతుమీ తేల్చుకోనుంది.

No comments:

Post a Comment