ఢిల్లీ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మహేశ్ భూపతి-యుకీ భాంబ్రీ జోడీ చాంపియన్గా నిలిచింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో భూపతి-యుకీ జోడీ 6-3, 4-6, 10-5తో డిఫెండింగ్ చాంపియన్ సాకేత్ మైనేని-సనమ్ సింగ్ ద్వయంపై గెలిచింది. గత మూడేళ్లలో భూపతికిదే తొలి టైటిల్. కాగా.. డబుల్స్లో తడబడిన సాకేత్.. పురుషుల సింగిల్స్లో ఫైనల్లో ప్రవేశించాడు.
No comments:
Post a Comment