తారకరత్న, పంచీ బోరా, అనూప్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ఎవరు’. ముప్పా క్రాంతి చిత్ర పతాకంపై ముప్పా అంకమ్మ చౌదరి నిర్మిస్తున్నారు. రమణ సాళ్వ దర్శకుడు. గురువారం నిర్మాతల మండలి హాలులో జరిగిన కార్యక్రమంలో టీజర్ను ఆవిష్కరించారు. ఈ చిత్రంలో తారకరత్న జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారనీ, సస్పెన్స్ మేళవింపుతో ఆద్యంతం చిత్రం ఆసక్తికరంగా నడుస్తుందనీ దర్శకుడు రమణ సాళ్వ చెప్పారు.
తారకరత్న మాట్లాడుతూ ‘‘ఇది విభిన్నమైన స్ర్కిప్టు. ఇప్పటి వరకూ ఈ తరహా కథ రాలేదు. హీరో హీరోయిన్ అని కాకుండా ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. అందరి కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిలా నిలుస్తుంది’’ అన్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదలకు సిద్ధం చేస్తున్నామనీ నిర్మాత అంకమ్మ చౌదరి తెలిపారు. సీతారామశాస్త్రి గారు రాసిన పాటలోనే సినిమా కథ ఇమిడి ఉంటుందనీ, తారకరత్న అభినయం ప్రధానాకర్షణ అవుతుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు యోగేశ్వరశర్మ, నటుడు రఘు కారుమంచి, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. నాజర్, సుమన్, లాస్య, బీరం మస్తానరావు తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, కృష్ణ చిన్ని, సహ నిర్మాత: లింగా శ్రీనివాసరావు, రచన, ఛాయాగ్రహణం, దర్శకత్వం: రమణ సాళ్వ.
No comments:
Post a Comment