దీంతో అతనికి బ్యాక్పగా పార్థివ్ పటేల్ను బంగ్లాదేశ్ పంపాలని సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్థివ్ వీలైనంత త్వరగా జట్టుతో చేరనున్నాడ’ని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కాగా.. సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో యువ పేసర్ జస్ప్రీత బుమ్రా కూడా పాల్గొనలేదు. దీంతో అతని ఫిట్నెస్పైనా అనుమానాలు చెలరేగాయి. అయితే.. వాతావరణ మార్పుల వల్ల బుమ్రా నలతగా కనిపించాడని.. కాబట్టి అతనికి ఒక రోజు విశ్రాంతి కల్పించారని తెలిసింది. కాగా.. దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న పార్థివ్ చివరిసారిగా 2012లో భారతకు ప్రాతినిథ్యం వహించాడు.
No comments:
Post a Comment