పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Tuesday, 23 February 2016

బెంగాల్‌ ఘన విజయం


ప్రొ కబడ్డీ లీగ్‌ మూడో అంచె పోటీల్లో బెంగాల్‌ వారియర్స్‌ గెలుపుజోరు కొనసాగిస్తోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 34-18తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై ఘన విజయం సాధించింది. జంగ్‌ కున లీ (6), గిరీష్‌ (5), కెప్టెన నీలేష్‌ షిండే (4), బాజీరావ్‌ (4) రాణించారు. జైపూర్‌ జట్టులో రాజేష్‌ నర్వాల్‌ (4), సోను నర్వాల్‌ (3), రణ్‌ సింగ్‌ (3) మాత్రమే పోరాడారు. ఇక పాయింట్ల పట్టికలో పాట్నా పైరేట్స్‌ (47), బెంగాల్‌ వారియర్స్‌ (37), పుణెరి పల్టన (32), యు ముంబా (30) టాప్‌-4లో ఉన్నాయి.

No comments:

Post a Comment