పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 19 February 2016

ఫెరారి నుంచి 488జిటిబి



FERRARI-
న్యూఢిల్లీ : ఇటాలియన్‌ సూపర్‌కార్ల తయారీ సంస్థ ఫెరారి భారత్‌ మార్కెట్‌లో గత ఏడాదే పునఃప్రవేశించింది. తన కొత్త కారు ఫెరారి 488 జిటిబిని భారత్‌ మార్కెట్‌కు విడుదల చేసింది. జిటిబి కారు 3.9 లీటరు, వి8 టర్బోఛార్జిడ్‌ ఇంజన్‌ ఏడు స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌తో వస్తోంది. ఎక్స్‌షోరూంధరగా 3.88 కోట్ల రూపాయలుగా కంపెనీ ప్రకటిం చింది. ఫెరారి 488 జిటిబి ఇండియాను ఇంట ర్నేషనల్‌ సేల్స్‌ డైరెక్టర్‌ ఔరెలీన్‌ సౌవర్డ్‌ సమ క్షంలో ఫెరారి మధ్యతూర్పు,ఆఫ్రికా దేశాల డైరెక్ట ర్‌ యాదుర్‌ కపూర్‌ తదితరప్రముఖుల సమక్షం లో కారును భారత్‌ మార్కెట్‌కు విడుదలచేసారు. కొత్తమోడల్‌ ఇంజన్‌ 660 బిహెచ్‌పి, 760 ఎన్‌ఎం, ఎలక్ట్రానిక్‌గా టాప్‌స్పీడ్‌లో 330 కిలోమీటర్లు గంటకు ప్రయాణిస్తుంది. ఫెరారి 488జిటిబి ఎనిమిది సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.

No comments:

Post a Comment