పాక్ ప్రభుత్వ నిర్ణయం తర్వాతే..
గత నెలలో ద్వైపాక్షిక సిరీస్ కోసం బీసీసీఐతో చర్చించేందుకు పాకిస్థాన క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన షహర్యాన ఖాన భారతకు రావడంపై పాక్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో జరగాల్సిన ఈ చర్చలను శివసేన కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో ద్వైపాక్షిక సిరీస్పై పీసీబీ ఆశలు పెట్టుకున్నా.. పాక్ ప్రభుత్వ నిర్ణయం తర్వాతే సిరీ్సపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, డిసెంబర్ 7న దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్ట్ల సిరీస్ ముగుస్తుంది. తర్వాత భారతకు మరో సిరీస్ లేదు. జనవరిలో మాత్రమే స్వల్ప కాలిక సిరీస్ కోసం ఆస్ర్టేలియా టూర్కు టీమిండియా వెళ్లనుంది. ఈ మధ్యలో భారత-పాక్ సిరీస్ నిర్వహిస్తే బాగుంటుందని ఇరు దేశాల బోర్డులు భావిస్తున్నాయి. కాగా భారత-పాక్ క్రికెట్ బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరు జట్ల మధ్య 2015, 2023 సంవత్సరాల్లో రెండేసి సార్లు ద్వైపాక్షిక సిరీ్సలు జరగాల్సివుంది. ఈ సిరీ్సల్లో ఇరు దేశాలు 14 టెస్ట్లు, 30 వన్డేలు, 12 టీ-20లు ఆడాల్సివుంది.
ఈ సిరీస్జరగదు
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత-పాకిస్థాన మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగే అవకాశం లేదని టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ తెలిపారు. ‘ఈ ఏడాది చివర్లో ద్వైపాక్షిక సిరీస్ జరగదనే భావిస్తున్నా. బోర్డులోని సభ్యులు కూడా భారతీయులే. ఉగ్రవాదంపై వారు వాస్తవ పరిస్థితులు గ్రహించాలి. సరిహద్దులో పాక్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సరిహద్దుల్లో శాంతి నెలకొనే వరకూ ఈ సిరీ్సపై చర్చలు జరపకూడద’ని కీర్తి ఆజాద్ అన్నారు.
No comments:
Post a Comment