పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Monday, 9 November 2015

ఏడాదిలోగా కనకదుర్గ వంతెన నిర్మాణం

కనకదుర్గ ఫ్లైఓవర్‌ లక్ష్యసాధనలో ఎన్నో అడ్డంకులు ఎదురయినా వాటన్నింటిని అధిగమించుకుంటూ సూపర్‌ ఫాస్ట్‌గా దూసుకు వెళ్లిన అర్‌అండ్‌ బీ క్వాలిటీ కంట్రోల్‌ ’సూపర్‌’టెండెంట్‌ ఇంజనీర్‌ జి.జానమోషేతో  ఆయన అనుభవాలను పంచుకున్నారు.
‘ఎన్నో సార్లు నేను కూడా ట్రాఫిక్‌ చక్రబంధంలో చిక్కుకున్నా. ఎప్పుడు ఈ కష్టాలు తీరుతాయ్యే అన్న ఆశతో ఎదురు చూశాను. ఫ్లైఓవర్‌ నిర్మాణంలో నా పాత్ర కొంత ఉండటం అనందంగా ఉంది. ఈ ఏడాది జరిగిన గోదావరి పుష్కారాల్లో అక్కడ జరిగిన అన్ని సివిల్‌ వర్క్స్‌ను దగ్గరుండి పర్యవేక్షించేందుకు ప్రభుత్వం నన్ను నియమించింది. జూలై 23వ తేదీన ఫ్లైఓవర్‌ బాధ్యతలు తీసుకున్నాను. ఫ్లైఓవర్‌ నిర్మాణం 2.55 కిలోమీటర్లు జరుగుతుంది. ఇంత పెద్ద ఫ్లైఓవర్‌లో ప్లాన మొత్తం బాగానే ఉన్నా ఒకే చోట రెండు సార్లు మార్చాల్సి వచ్చింది. బందర్‌ కాలవ దగ్గరలో వేసే ప్రతి ఫిల్లర్‌కి మధ్య 50 మీటర్ల దూరం ఉండేలా ప్లాన మార్చాం. మొదటి ప్లానలో ప్రకాశం బ్యారేజీకి ఫ్లైఓవర్‌కి మధ్య 100 మీటర్ల దూరం ఉండేది. దీనిపై బ్యారేజీ ఎక్ష్స్‌ఫర్ట్‌ కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వెంటనే బ్యారేజీ నుంచి 300 మీటర్ల దూరం ఉండేలా ప్లాన మార్చాం. ఫ్లైఓవర్‌ ప్లానను కేంద్ర ప్రభుత్వానికి అందించిన తర్వాత ఉపరితల రవాణా, రాజమార్గాల మంత్రిత్వ శాఖ నుంచి అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ థావడీ వచ్చినప్పుడు బందరు రోడ్డు మీదుగా కుమ్మరిపాలెం సెంటర్‌లో భారీగా ట్రాఫిక్‌ అగిపోయింది. సుమారు 15 నిమిషాలు వేచి చూసినా ట్రాఫిక్‌ క్లియర్‌ కాలేదు. ఆ రోజు సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం ఉదయం ఆఫీసుకు వెళ్లగానే ఫ్లైఓవర్‌ ఫైల్‌పై సంతకం పెట్టారు. మొదట ప్లాన ఓకే అయిన తర్వాత ప్రాజెక్టు ఖరీదు 447.8 కోట్లుగా నిర్ణయించాం. రూ. 333.2 కోట్లు మాత్రమే కేంద్ర కేటాయిస్తుందని సృష్టంగా చెప్పారు. స్థల స్వీకరణకు అయ్యే రూ. 114.6 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించుకోవాలని సూచించారు. చీఫ్‌ సెక్రటరీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నుం చి కేటాయించేందుకు అనుమతించారు. ప్లాన అంతా ఆమో దం తెలిపిన తర్వాత, నిధుల విడుదలపై సృష్టత వచ్చిన తర్వాత ఆక్టోబరు 1వ తేదీన కేంద్ర ఉపరితల రవాణా, రాజమార్గాల మంత్రిత్వ శాఖ టెండర్స్‌ సోమా కంపెనీకి టెండర్స్‌ కేటాయిస్తున్నట్లు కేంద్ర నుంచి నవంబర్‌ 5న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. ఏడాది లోపు ఫ్లైఓవర్‌ పనులు పూర్తి చేసిన ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెడతాం.

No comments:

Post a Comment