పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

రెండు వేల మంది ‘పతక వాపసీ’

  • మాజీ సైనికోద్యోగుల నిరసన కార్యక్రమం షురూ 
  • ఇది సైనిక క్రమశిక్షణకు విరుద్ధం: పర్రీకర్‌ వ్యాఖ్య 
  • మాజీల సంఘాల్లో నిరసనపై భిన్నాభిప్రాయాలు 
  • ప్రభుత్వ తీరు ఆదినుంచీ మోసపూరితం: కాంగ్రెస్‌ 
 ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్‌(ఓఆర్‌ఓపీ) పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చిందని నిరసిస్తూ మాజీ సైనికులు ‘పతక వాపసీ’కి శ్రీకారం చుట్టారు. ఈమేరకు మంగళవారం ఢిల్లీసహా హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో దాదాపు 2వేల మందికిపైగా పతకాలు వెనక్కు ఇచ్చేశారు. వీరిలో మేజర్‌ జనరళ్లు, సుబేదార్‌ మేజర్లు, కెప్టెన్లు, సిపాయిలుసహా వివిధ ర్యాంకుల వారున్నారు. తమ ఉద్యమం 2008లో ప్రారంభమయ్యాక దాదాపు 20వేల మంది పతకాలు వాపసు చేశారని, దీన్ని ఇటీవలి మేధావుల నిరసనతో పోల్చవద్దని మాజీ సైనికుల ప్రతినిధి కల్నల్‌(రిటైర్డ్‌) అనిల్‌కౌల్‌ చెప్పారు. ఈ పండుగను ‘చీకటి దీపావళి’గా పరిగణిస్తున్నామని ప్రకటించారు. మహారాష్ట్ర, కర్ణాటకలలో బుధవారం ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. కాగా, పతక వాపసీ సైనిక క్రమశిక్షణకు విరుద్ధమని రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పర్రీకర్‌ వ్యాఖ్యానించారు. నలభై ఏళ్లనాటి ఓఆర్‌ఓపీ డిమాండ్‌ను నెరవేర్చడం ఏడాది కాలంలో బీజేపీ సర్కారు తీసుకున్న ఓ గొప్ప నిర్ణయమన్నారు. దీనిపై అనిల్‌కౌల్‌ మండిపడుతూ పర్రీకర్‌ వైఖరి రక్షణమంత్రి హోదాకే అనుచితమని తిప్పికొట్టారు. మరోవైపు పతకాల వాపసు సైనిక నియతికి విరుద్ధమని ఇండియన్‌ ఎక్స్‌-సర్వీ్‌సమెన్‌ లీగ్‌(ఐఈఎ్‌సఎల్‌) నేత లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) దల్బీర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. దీనివెనుక రాజకీయ ప్రోద్బలం ఉండవచ్చునని, ఇందులో భాగస్వాములు కావద్దని తమ సంస్థ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఓఆర్‌ఓపీ నోటిఫికేషన్‌ పార్లమెంటు వ్యవస్థనే ఉల్లంఘిస్తున్నదని మాజీ సైనికోద్యమ సంఘం చైర్మన్‌ మేజర్‌ జనరల్‌ (రిటైర్డ్‌) సత్బీర్‌సింగ్‌ అన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం మాజీ సైనికులతో మోసపూరిత రాజకీయాలు చేస్తున్నదని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. మాజీ సైనికులకు సర్కారు దీపావళి బహుమతి కాకుండా షాక్‌ ఇచ్చిందని రక్షణశాఖ మాజీ మంత్రి ఎ.కె.ఆంటోనీ వ్యాఖ్యానించారు. కాగా, పతకాల వాపసు వద్దని, ఏకసభ్య కమిషన్‌ సమక్షంలో సమస్యలను ప్రస్తావించాలని ఓఆర్‌ఓపీపై మాజీ సైనికులతో చర్చలు నిర్వహించిన స్వతంత్ర ఎంపీ రాజీవ్‌ చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు

No comments:

Post a Comment