పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Monday, 9 November 2015

రాజధానిలో పట్టణ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

  • నగర ఆహార అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది 
  • ఇందుకోసం సారవంతమైన భూమిని రిజర్వు చేయాలి 
  • కృష్ణానది పొడవునా భూమిని ఉపయోగించండి 
  • సీఆర్‌డీఏకు కేంద్ర పర్యావరణ శాఖ స్పష్టీకరణ 
అమరావతి రాజధాని నగరంలో పట్టణ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిందిగా కేంద్ర పర్యావరణ శాఖ సీఆర్‌డీఏకు సూచించింది. రాజధాని ప్రజల ఆహార అవసరాలు తీర్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయ పడింది. కృష్ణానది వెంట సారవంతమైన భూమిని పట్టణ వ్యవసాయ అవసరాలకు రిజర్వు చేయాల్సిందిగా సూచించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రాజధాని ప్రజలకు కూరగాయలు, ఆకుకూరలు వంటి అవసరాలు ఎలా తీరతాయన్న సందేహాలకు తెర పడినట్లు అయింది. రాజధాని నగర పరిధిలో ముఖ్యంగా తుళ్లూరు మండలంలోని జరీబు భూములు, ఉండవల్లి, పెనుమాక, యర్రబాలెం, కృష్ణాయపాలెంలలో కూరగాయలు, ఆకు కూరల సాగు విస్తృతంగా సాగేది. అమరావతి రాజధాని కోసం ఈ భూములను రైతులు స్వచ్ఛంధంగా సీఆర్‌డీఏకి ఇచ్చేయడం వలన కూరగాయలు, ఆకు కూరల సాగు నిలిచిపోయింది. దీంతో రేపటి రోజున రాజధాని నిర్మాణం జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి నివాసం ఉండే లక్షలాది మంది ప్రజల కూరగాయల అవసరాలు ఎలా తీరుతాయోనన్న సందేహాలు ఉండేవి. దీనికి కేంద్ర పర్యావరణ శాఖ చక్కని పరిష్కారానికి చూపించింది. కృష్ణానది వెంట రెండు నుంచి మూడు కిలోమీటర్ల భూమిని గ్రీనబెల్టుగా డిక్లేర్‌ చేసి అందులో పట్టణ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించింది. వ్యవసాయంపై మక్కువ ఉన్న రాజధాని రైతులకు పర్యావరణ శాఖ తీసుకొన్న ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. అరటి, క్యాబేజ్‌, క్యాలీఫ్లవర్‌, దొండ, కాకర, బీర, వంకాయ, సొరకాయ, పొట్లకాయల సాగుకు రాజధాని భూములు ప్రసిద్ధి. అలానే కొత్తిమీర, కరివేపాకు వంటి ఆకు కూరలు కూడా ఇక్కడ సాగు అవుతుంటాయి. ఈ నేపథ్యంలో రాజధాని ప్రజల అవసరాలకు ఇక్కడ పండే తాజా కూరగాయలు ఉపయోగపడతాయి. పట్టణ వ్యవసాయానికి అవసరమైన సాగునీటిని రాజధానిలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని శుద్ధి చేసి మార్చే మంచినీటిని వినియోగించుకోవచ్చని సూచించింది. ఇందుకోసం ఆయా నీటి శుద్ధి కర్మాగారాల నుంచి పైపులైన్లను నిర్మించుకోవాలని పేర్కొన్నది. కృష్ణానది వెంట 10 అడుగుల లోతులోనే భూగర్భ జలం ఉండటాన్ని పరిగణనలోకి తీసుకొంటే పట్టణ వ్యవసాయానికి ఎలాంటి నీటి కొరత కూడా ఉండదు.ఉదయం మంత్రితో తాగునీటి సమస్య తీవ్రతను వివరించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తాగునీటి చెరువులు నింపడానికి నాలుగు టీఎంసీల నీరు అవసరమని ఎస్‌ఈ కృష్ణారావు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో మంత్రి దేవినేని వెంటనే నీరు విడుదల చేయాలని ఆదేశించారు. రోజుకు 500 క్యూసెక్కుల నీరు ప్రారంభంలో విడుదల చేసి దశల వారీగా పెంచాలని స్పష్టం చేశారు. రెండు జిల్లాల్లో తాగునీటి చెరువులు నింపే విధంగా నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్‌ విభాగాలు సమన్వయంగా పని చేయాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు బుగ్గవాగు నుంచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు గుంటుపల్లి రాయలు తెలిపారు.

No comments:

Post a Comment