పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

మరోసారి విలన్‌గా

తారకరత్న హీరోగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ మాత్రం కలిసిరాలేదు. అయితే అతడిలోని మరో కోణం అమరావతి సినిమాతో బయటపడింది. ఇలాంటి రోల్స్ చేస్తే తారకరత్న కెరీర్ ఊపందుకునే అవకాశముందని అప్పట్లో అనుకున్నారు. ఇతగాడు అదే ఫిక్సయినట్టున్నాడు. ఫ్యామిలీ హీరోతో మరోసారి నెగిటివ్ రోల్ చేసేందుకు తారకరత్న సిద్ధమయ్యాడు. నారా రోహిత్ హీరోగా ప్రదీప్ అనే యువ దర్శకుడు తెరకెక్కించబోయే ‘రాజా చేయి వేస్తే’ సినిమాలో తారకరత్న విలన్‌గా నటించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. దీంతో పాటు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రోహిత్ హీరోగా ‘జ్యో అచ్యుతానంద’ అనే మరో సినిమాకీ నిర్మాత ఆయనే

No comments:

Post a Comment