పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

డిజైన్‌ ప్రమిదలతో కుమ్మరులపై దెబ్బ

  • చేయూతనిస్తున్న ఒడిస్సా ప్రభుత్వం 
  • ఆకట్టుకునేలా ప్రమిదల తయారీలో శిక్షణ 
 దీపావళి అనగానే టపాసుల కన్నా ముందుగా గుర్తుకు వచ్చేది దీపాలు. ఒకప్పుడు దీపావళి వచ్చిందంటే కుండలు చేసే కుమ్మరులకు రెండు చేతులా పని ఉండేది. ఎక్కువ మంది వారు తయారుచేసిన ప్రమిదలనే వాడేవారు. కానీ ఇప్పుడు ప్రపంచీకరణతో రంగురంగుల డిజైన్లతో కూడిన ప్రమిదలు, ఎలక్రికల్‌ దీపాలు ఆన్‌లైన్‌లోనూ, బహిరంగ మార్కెట్‌లోనూ అందుబాటులోకి వచ్చేశాయి. ప్రజలు కూడా వాటికే బాగా ఆకర్షితులవుతున్నారు. దీంతో వారసత్వంగా వస్తున్న వృత్తిని నమ్ముకుని బతుకుతున్న కుమ్మరులు, వారు తయారు చేసే సాధారణ ప్రమిదలు అమ్ముకునే చిన్న వ్యాపారులూ వారి జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒడిస్సా రాష్ట్ర ప్రభు త్వం వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు డిజైన్‌లతో కూడిన ప్రమిదల తయారీలో వారికి శిక్షణ ఇస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో అనేక వర్క్‌షాపులు పెట్టింది. దీంతో అక్కడి ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన వర్క్‌షాపులలో పెయింటింగ్‌ ప్రమిదలు మొదలు ఎలకి్ట్రక్‌ ప్రమిదల వరకూ అన్ని రకాలైన వాటి తయారీలోనూ శిక్షణ ఇస్తున్నారని కుమ్మరులు చెబుతున్నారు. 

వినియోగదారులను ఆకట్టుకోగలుగుతున్నాం 
‘‘25 ఏళ్లుగా మా కుటుంబం మట్టి కుండలు వంటివి చేస్తూ ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తోంది. మా తండ్రి నుంచి వారసత్వంగా నేను ఈ వృత్తి చేపట్టాను. కొద్ది సంవత్సరాలుగా మేము తయారుచేస్తున్న సాదా ప్రమిదలకు డిమాండ్‌ తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన శిక్షణలో రకరకాల డిజైన్‌లలో ప్రమిదలు తయారుచేయడం నేర్చుకున్నాను. గతంలో మేము చేసే సాదా ప్రమిదల్లో రూపాయి, రెండు రూపాయలు మాత్రమే లాభం ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వ సాయంతో నేర్చుకున్న డిజైనర్‌ ప్రమిదలకు బాగా డిమాండ్‌ ఉంది. ఇవి రూ. 25 మొదలు వెయ్యి వరకు రకరకాల డిజైన్‌లలో ఉన్నాయి. వీటికి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రభుత్వ సాయంతో మా జీవితాలకు భరోసా వచ్చింది.’’ 

No comments:

Post a Comment