బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం సూచించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం రాగల 48 గంటల్లో మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందనీ, ఇది తమిళనాడు దిశగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
No comments:
Post a Comment