పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Tuesday, 10 November 2015

కార్పొరేషన్ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు

ఏసీబీ దాడులు కోసం చిత్ర ఫలితం
నెల్లూరు నగరపాలక సంస్థలో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న పి. కృష్ణయ్య ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో ఈ దాడులు నిర్వహించారు. నెల్లూరులో ఆయన ఇంట్లో జరిగిన తనిఖీల్లో రూ.2 కోట్ల విలువైన ఆస్తుల వివరాలు దొరికినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ మల్కాజ్‌గిరి, బెంగుళూరులోని ఆయన సమీప బంధువుల ఇళ్లపై కూడా దాడులు నిర్వహించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

No comments:

Post a Comment